వ్యవసాయ అప్పులు,మేస్త్రి పని దొరకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై వ్యక్తి ఆత్మహత్య.
ప్రజా గొంతుక (మార్చి 21) కాల్వ శ్రీరాంపూర్: కౌజుల మధునయ్య అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూనరం గ్రామం లొ చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కునారం గ్రామానికి చెందిన కౌజుల మదనయ్య అను వ్యక్తి, మేస్త్రి పని, కౌలుకు వ్యవసాయం చేస్తూ జీవనసాగిస్తుడేవాడు, మేస్త్రి పనులు దొరకపోగా,వ్యవసాయానికి కొరకుతెచ్చిన అప్పులు, వడ్డీ పెరగి పోవడం తో, తీవ్ర మనోవేదనకు గురై, మృతుడు మదనయ్య కౌలు భూమి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి, గ్రామంలోని ఓ వ్యక్తికి ఫోన్ చేసి తెలుపగా, వెంటనే వ్యవసాయ క్షేత్రం వెళ్లి, గ్రామంలోని ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై ప్రధమ చికిత్స కొరకు పెద్దపల్లి ప్రభుత్వా హాస్పటల్ కు తరలించి,చికిత్స కొనసాగిస్తుండగా మృతి చెందినట్లు భార్య కంజుల స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు.











