E-PAPER

మోట్లపల్లిలో బురిడీ బాబా మోసాలు, నగతు డబ్బులు బంగారం తో ఉడాయింపు…

Date : 20 March 2026, 7:36 pm Posted By : PRAJA GONTHUKA

మోట్లపల్లిలో బురిడీ బాబా మోసాలు, నగతు డబ్బులు బంగారం తో ఉడాయింపు…

మోట్లపల్లిలో బురిడీ బాబా మోసాలు, నగతు డబ్బులు బంగారం తో ఉడాయింపు...

ప్రజా గొంతుక మార్చి 20 కాల్వ శ్రీరాంపూర్ : మీ జాతకం బాగాలేదని, శాంతి పూజలు చేయాలంటూ, మోట్లపల్లి గ్రామంలోని పలువురిని వద్ద బంగారం, డబ్బులు పట్టుకొని ఉడయించిన ఘటన గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మొ ట్లపల్లి గ్రామంలో గత మూడు రోజుల క్రితం ఓ బురిడీ బాబా నా పేరు రామిరెడ్డి అంటూ గ్రామంలో ప్రవేశించి, కొందరి ఇంట్లోకి ప్రవేశించి, మీకు జ్యోతిష్యం చెప్తానని, మీ జాతకం బాగాలేదు అని, మీ చుట్టుపక్కల ప్రజలు మీపై ఏడుపు ఉన్నది అని, అందుకే మీరు ఆరోగ్యంగా ఉంటాలేరు అని, ఎక్కువగా అనారోగ్యం పాలవుతున్నారని, మీ కష్టం వృధా అవుతుందని, నాలుగు మాటలు చెప్పి, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కొంత డబ్బులు ఖర్చు అవుతుందని శాంతి పూజలు చేయాలని చెప్పడంతో బాధితులు అదే నిజమని మాకు అలానే జరుగుతుందని భావించి, ఆ దొంగ బాబా మాటలు నమ్మిన బాధితుల కొందరు గోనె రాయరాం 04 వేల వేల నగదు రూపాయలు కొంత బంగారం, బందెల కలమ్మ మల్లయ్య 16 వేల నగదు, అలాగే దామెర మొగిలి వద్ద నుంచి 16 వేల రూపాయలు తీసుకొని, మంగళవారం ఉదయాన్నే మళ్ళీ వస్తానని, శాంతి పూజలు చేస్తానని, ఉదయాన్నే మీరు స్థానాల ఆచరించి పూజకు సిద్ధంగా ఉండాలని తెలిపి వెళ్లిపోయినట్లు బాధితులు ఆరోపించారు. ఆ దొంగ బురిడీ రాంరెడ్డి బాబా అనే వ్యక్తి శుక్రవారం అయినా కూడా రాకపోవడంతో మమ్మల్ని మోసం చేయడని గుర్తించి, పోలీస్ స్టేషన్లో సమాచారం చేసినట్లు రాయరాం తెలిపారు. పోలీసులు వచ్చి సంఘటన స్థలాన్ని కూడా పరీక్షించి, సిసి కెమెరాలు ద్వారా గుర్తించి తగు న్యాయం చేస్తామని అన్నట్లు బాధితుడు రాయరాం తెలిపారు.ఇంకా ఈ గ్రామంలో బాబా మోసాలకు మోసపోయిన బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియాల్సి ఉంది. ఇలాంటి దొంగ బాబాల హద్దులు లేకుండా పోయాయని,ఎన్నో ఘరానా మోసాలు వెలుగు చూసిన జనం... ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో తెలుసుకోలేకపోతున్నారు పలువురు అనుకుంటున్నారు.

⬇ DOWNLOAD
×

మోట్లపల్లిలో బురిడీ బాబా మోసాలు, నగతు డబ్బులు బంగారం తో ఉడాయింపు…

ప్రజా గొంతుక మార్చి 20 కాల్వ శ్రీరాంపూర్ : మీ జాతకం బాగాలేదని, శాంతి పూజలు చేయాలంటూ, మోట్లపల్లి గ్రామంలోని పలువురిని వద్ద బంగారం, డబ్బులు పట్టుకొని ఉడయించిన ఘటన గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మొ ట్లపల్లి గ్రామంలో గత మూడు రోజుల క్రితం ఓ బురిడీ బాబా నా పేరు రామిరెడ్డి అంటూ గ్రామంలో ప్రవేశించి, కొందరి ఇంట్లోకి ప్రవేశించి, మీకు జ్యోతిష్యం చెప్తానని, మీ జాతకం బాగాలేదు అని, మీ చుట్టుపక్కల ప్రజలు మీపై ఏడుపు ఉన్నది అని, అందుకే మీరు ఆరోగ్యంగా ఉంటాలేరు అని, ఎక్కువగా అనారోగ్యం పాలవుతున్నారని, మీ కష్టం వృధా అవుతుందని, నాలుగు మాటలు చెప్పి, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కొంత డబ్బులు ఖర్చు అవుతుందని శాంతి పూజలు చేయాలని చెప్పడంతో బాధితులు అదే నిజమని మాకు అలానే జరుగుతుందని భావించి, ఆ దొంగ బాబా మాటలు నమ్మిన బాధితుల కొందరు గోనె రాయరాం 04 వేల వేల నగదు రూపాయలు కొంత బంగారం, బందెల కలమ్మ మల్లయ్య 16 వేల నగదు, అలాగే దామెర మొగిలి వద్ద నుంచి 16 వేల రూపాయలు తీసుకొని, మంగళవారం ఉదయాన్నే మళ్ళీ వస్తానని, శాంతి పూజలు చేస్తానని, ఉదయాన్నే మీరు స్థానాల ఆచరించి పూజకు సిద్ధంగా ఉండాలని తెలిపి వెళ్లిపోయినట్లు బాధితులు ఆరోపించారు. ఆ దొంగ బురిడీ రాంరెడ్డి బాబా అనే వ్యక్తి శుక్రవారం అయినా కూడా రాకపోవడంతో మమ్మల్ని మోసం చేయడని గుర్తించి, పోలీస్ స్టేషన్లో సమాచారం చేసినట్లు రాయరాం తెలిపారు. పోలీసులు వచ్చి సంఘటన స్థలాన్ని కూడా పరీక్షించి, సిసి కెమెరాలు ద్వారా గుర్తించి తగు న్యాయం చేస్తామని అన్నట్లు బాధితుడు రాయరాం తెలిపారు.ఇంకా ఈ గ్రామంలో బాబా మోసాలకు మోసపోయిన బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియాల్సి ఉంది. ఇలాంటి దొంగ బాబాల హద్దులు లేకుండా పోయాయని,ఎన్నో ఘరానా మోసాలు వెలుగు చూసిన జనం… ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో తెలుసుకోలేకపోతున్నారు పలువురు అనుకుంటున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్