జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యేలు విజ్జన్న, రాజ్ ఠాగూర్ కు ప్రత్యేకంగా రుణపడి ఉంటా.
ప్రజా గొంతుక ( మార్చి 19) కాల్వ శ్రీరాంపూర్ :జిల్లా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఎన్నికైన కాల్వ శ్రీరాంపూర్ మాజీ సర్పంచ్ మాదాసు సతీష్ కు కృతజ్ఞతలు తెలిపిన మండల కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి,జిల్లా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఎన్నుకున్న జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణ రావు తన పట్ల నమ్మకం ఉంచి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అవకాశం కల్పించినందుకు, వారికి రుణపడి ఉంటానని అన్నారు.పార్టీ పటిష్టత కొరకు పని చేస్తానని తెలిపారు. అలాగే నా ఎన్నిక కొరకు పూర్తి సహాయ సహకారాలు అందించిన మాజీ ఎంపీపీ గోపగాని సరయ్య గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు గాజరవేణ సదయ్య కు రుణపడి ఉంటానని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కార్యకర్తలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానాని వారు పేర్కొన్నారు.












