అపదలో ఉన్నవారిని ఆదుకునే ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
కుత్బుల్లాపూర్ మార్చ్ 19 ( ప్రజా గొంతుక )
గాజుల రామారం డివిజన్ ఆదర్శ్ నగర్ కు చెందిన మద్దు రాఘవేంద్ర రావు తండ్రి మద్దు వీర రాఘవులు అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని స్థానిక బిఆర్ఎస్ నాయకులు పరుష శ్రీనివాస్ యాదవ్ ద్వారా బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2.00 (రెండు లక్షల రూపాయలు) లక్షల రూపాయలను మంజూరు చేయించగా గురువారం చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో డివిజన్ కు చెందిన నాయకులు లబ్ధిదారుడి కుటుంబసభ్యులకు సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... ఆపదలో ఉన్నామని మెరుగైన వైద్య సహాయం కోసం వచ్చిన ప్రతీ ఒక్కరిని ఆదుకునే నాయకులు మన నాయకులు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, నాయకులు సమ్మయ్య, శివా నాయక్ తదితరులు పాల్గొన్నారు.












