ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య ని కలిసిన రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు
సంవత్సరల నుండి తిరిగినా బేడ బుడగ జంగాల కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయట్లే..
ప్రజా గొంతుక డెస్క్
హైదరాబాదులో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య ని రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు కలిసి కామరెడ్డి జిల్లాలోని మాచిరెడ్డి మరియు దోమకొండ మండలంలో మా బేడ బుడగ జంగాల కులానికి చెందిన వారికి బేడ బుడగ జంగాల కుల ధ్రువీకరణ పత్రాలు గత సంవత్సరం నుండి మంజూరు చేయడం లేదని చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. కామరెడ్డి జిల్లా కలెక్టర్ మరియు ఆర్డీవో మాచరెడ్డి మండలం ఎమ్మార్వో మరియు దోమకొండ మండలం ఎమ్మార్వో గార్ల చుట్టూ సంవత్సర నుండి తిరిగినా కూడా బేడ బుడగ జంగాల కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడం లేదని కావున మా పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చైర్మన్ని కోరడం జరిగింది అనుకూలంగా స్పందించిన చైర్మన్ కి మా బేడ బుడగ జంగం జన సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల ఉపాధ్యక్షులు మోతే సుమన్. సాయిలు. రవి. లక్ష్మీపతి మరియు తదితరులు పాల్గొన్నారు.












