అర్హులైన ప్రతీ ఒక్కరూ సీఎంఆర్ఎఫ్ సద్వినియోగం చేసుకోవాలి
కుత్బుల్లాపూర్ మార్చ్ 18 ( ప్రజా గొంతుక )
చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో 126 - జగద్గిరిగుట్ట డివిజన్ కు చెందిన నలుగురు ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు డివిజన్ కు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, అధ్యక్ష, నాయకుల చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.....నిరుపేదల పెన్నిధి ముఖ్యమంత్రి సహాయనిధి అని, అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్సకోసం ఎదురుచూస్తున్న ప్రతీ ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారుల వివరాలు..
రూ.50,000/ - ఎనుముల ఆదిలక్ష్మి, రూ.75,000/ - యెన్నం భారతమ్మ,
రూ. 2.00 లక్షలు బోనం రామ సుబ్బారావు,
రూ.75.000/ కమ్మరి గౌతమి లకు చెక్కులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, నాయకులు మెట్ల శ్రీను, సయ్యద్ సాజీద్, ముంతాజ్ అలీ, సులేమాన్ తదితరులు పాల్గొన్నారు.












