మానవత్వమా నీకు సలాం.......
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:17నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం హలియా పట్టణంకి చెందిన లక్షమ్మ అనే వృద్దురాలు ఆనారోగ్యంతో మరణించారునిరుపేద కుటుంబానికి చెందిన లక్ష్మమ్మ కాలి గాయంతో భాదపడుతూ కింద పడుకోవటం చూసి వారి ఇంటి పక్కన ఉండే వాళ్ళు అమీర్ అలి ఫౌండేషన్ కి సమాచారం ఇవ్వడంతో వారి కుటుంబానికి బియ్యం నిత్యవసర సరుకులు ఐరన్ మంచం ఇవ్వడం జరిగింది గతంలో , ఈరోజు లక్ష్మమ్మ ఆకస్మిక మరణం కిరాయి ఇంట్లోకి పార్దీవదేహం రానివ్వని పక్షంలో అమీర్ అలి ఫౌండేషన్ సలహాదారులు షర్ఫద్దిన్ { లల్లు } మానవాతా దృక్పధంతో ముందుకు వచ్చి వారి ఇంట్లో లక్ష్మమ్మ పార్దివదేహం ఉంచి వారి బందువులకు మిత్రులకి సమాచారం అందించి దగ్గరుండి అంత్యక్రియలు జరపటం కులమతాలకీ అతీతంగా లక్ష్మమ్మ పాడే మోయటం అభినందనీయం మానవత్వమే మన అందరి మతం అభిమతం అని చాటిన షర్ఫద్దిన్ ని అమీర్ అలి ఫౌండేషన్ సభ్యుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేశారు












