లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మహా హోమం...
మహా హోమంలో పాల్గొన్న సర్పంచ్ శ్రీధర్ గౌడ్....
పాల్గొన్న సాల్వాపూర్ సర్పంచ్ మిద్దెల శ్రీధర్ గౌడ్
ప్రజా గొంతుకబచ్చన్నపేటమండలం
మండలంలోని సల్వాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో సోమవారం ఆలయ శక్తిని పునరుద్ధరించే ఉద్దేశంతో మహా సామూహిక సుదర్శన స్వామి సంప్రోక్షణ మరియు హోమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు మామిడాల రోహిత్ ఆచార్యులు వేదమంత్రాల మధ్య నిర్వహించారు.సందర్భంగా గ్రామ ప్రజలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అభివృద్ధి మరియు గ్రామ శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. గ్రామం లో ఉన్న భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మిద్దెల శ్రీధర్ గౌడ్, ఉప సర్పంచ్ నల్గురి కిష్టయ్య, వర్తమాన సభ్యులు మెంతుచర్స్ కుమార్, భాను, రాజు, మాజీ ఎంఫీటీసీ బాల నారాయణ, అధ్యక్షుడు పోచయ్య కుమార్, శ్రీకాంత్, శ్రీహరి, బిక్షపతి, రఘుపతి, లింగయ్య, నరేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.












