డబల్ బెడ్ రూమ్ సముదాయంలో స్వంత నిధులతో మంచినీటి సమస్యను తీర్చిన బీకేఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు కిషోర్ రెడ్డి
కుత్బుల్లాపూర్ మార్చ్ 16 ( ప్రజా గొంతుక ) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ గండి మైసమ్మ 294 డివిజన్ డబుల్ బెడ్ రూమ్ ల సముదాయంలో తాగునీటి విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యపై డబల్ బెడ్ రూమ్ కాలనీ వాసులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బికేఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు బొంగునూరి కిషోర్ రెడ్డిని కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలలో ముఖ్యమయిన తాగునీటి సమస్యను వారి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి ఆయన తన బికేఆర్ ఫౌండేషన్ ద్వారా బోర్ వేయించి ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చారు.ఈ విషయంపై సంతోషం వ్యక్తం చేసిన కాలనీ ప్రజలు కిషోర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.... ప్రజలకు ఎలాంటి సమస్యలున్న తన దృష్టికి వస్తే సమస్య పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తానని అదేవిధంగా ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దుండిగల్ మాజీ సర్పంచ్ కావలి గణేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏఆర్ సాదు యాదవ్, డబల్ బెడ్ రూమ్ జనరల్ సెక్రెటరీ నాగేష్, సంతోష్, పాషా, భాస్కర్ కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.












