పేద ప్రజల అభివృద్దే నా ధ్యేయం: నాగపురి కిరణ్
జనగాం నియోజక వర్గ వ్యాప్తంగా అనారోగ్యసమస్యలతో కష్టాల్లో ఉన్న పేదకుటుంబాలకు CMRF పథకం ద్వారా అండగా నిలుస్తున్న : నాగపురి కిరణ్ కుమార్ గౌడ్
దూల్మిట్ట మండల కేంద్రంలో 4 లక్షల CMRF చెక్కుల పంపిణీ.
దూల్మిట్ట మండల పరిధిలోని పలు గ్రామాల పేద ప్రజలు అనారోగ్య సమస్యల కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానిక కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగపురి.కిరణ్ కుమార్ గౌడ్ గారు దృష్టి కి తీసుకెళ్లగా వారు స్పందించి మంత్రి వర్యులు శ్రీ.పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరియు భువనగిరి ఎంపీ శ్రీ చామల. కిరణ్ కుమార్ రెడ్డి గార్ల సహకారంతో CMRF పథకం ద్వారా రూ :4,00,000 (నాలుగు లక్షల రూపాయలు ) విలువైన చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా నాగపురి. కిరణ్ మాట్లాడుతూ జనగాం నియోజక వర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు నిరుపేద కుటుంబాలకు సుమారు 10 కోట్ల రూపాయల విలువైన CMRF,LOC చెక్కులు ఇస్తూ పేద కుటుంబాలకు అండగా ఉన్నానని, ఇక ముందు కూడా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే మా నాన్న గారు నాగపురి.రాజలింగం (EX MLA, MLC) గారికి దూల్మిట్ట మండల కేంద్రము తో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో దూళిమిట్ట గ్రామ ఉపసర్పంచ్ తుషాలపురం రాజు, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండి రఫీక్, మాజీ తోర్నాల సర్పంచ్ గొల్లపల్లి పరశురాములు, గంగాధర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎలికట్ట శ్రీనివాస్ గౌడ్, వార్డ్ మెంబర్ చంద్రమౌళి, గొల్లపల్లి రమేష్, నాచగొని.రితేష్, తుశాల పురం బాబు, నవీన్, లింగం గౌడ్, భూపతి, కంది వంశీ, గోవర్ధన్, ఈశ్వర్, ఆలేటి రాజు, నందనబోయిన బాలయ్య తదితరులు పాల్గొన్నారు. తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.












