వార్డులలో తడి-పొడి చెత్త సేకరణ
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మున్సిపా లిటీలో ప్రజాపాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా 1వ, 12వ వార్డులలో శుభ్రపరచారు. 1వ వార్డు కౌన్సిలర్ తిరుమలేష్, 12వ వార్డు కౌన్సిలర్ పాగుంట సువర్ణ ఆధ్వర్యంలో తడి-పొడి చెత్తను సేకరించి, మున్సిపా లిటీ వాహనాలతో డంపింగ్ యార్డ్కు తరలించారు.కౌన్సిలర్లు ప్రజలకు సూచ నలు చేస్తూ ప్రతి ఇంటి ముందు శుభ్రంగా ఉంచడం, శుభ్రత పాటించడం మన అందరి బాధ్యతని వ్యర్థాలను రోడ్లపై వేస్తే ఆరోగ్య సమస్యలు, దోమల బెడద తలెత్తే అవకాశం ఉంటుందని మున్సి పాలిటీ వాహనం వచ్చినప్పుడు చెత్తను మున్సిపాలిటీ చెత్తను మోసుకెళ్లే వెహిక ల్ లో వేయాలని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం వార్డుల్లో శుభ్రతా అవగా హన పెంచింది.












