సమస్యల పరిష్కారం కోసం కుత్బుల్లాపూర్ జోనల్ కార్యాలయం పిర్యాదు
కుత్బుల్లాపూర్ మార్చ్ 13( ప్రజా గొంతుక ) కుత్బుల్లాపూర్ జోనల్ నూతన కమిషనర్ పింకేష్ కుమార్ లలిత్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన సీనియర్ బిఆర్ఎస్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, మాజీ ప్రెసిడెంట్ ఆలూరు వెంకట శేషాచారి.నూతనంగా నియమితులైన కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ ను జోనల్ కమిషనర్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసి ఎస్సార్ నాయక్ నగర్ లో జిహెచ్ఎంసి పార్కు డెవలప్మెంట్, ఉమ్మడి (130) సుభాష్ నగర్ డివిజన్లో ఉన్న పలు సమస్యలు పరిష్కరించాలని గుబ్బల లక్ష్మీనారాయణ, ఆలూరి వెంకట శేషాచారి జోనల్ కమిషనర్ గారిని కలిసి వినతి పత్రము యిచ్చారు .ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ మాట్లాడుతూ... త్వరలో పర్యటన చేసి కిందిస్థాయి సిబ్బందితో కూడా మాట్లాడి పార్క్ డెవలప్మెంట్, డివిజన్లో ఉన్న పలు సమస్యలపై పర్యటించి పరిష్కారం అయ్యేటట్టు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్సార్ నాయక్ నగర్ మాజీ ప్రెసిడెంట్ ఆలూరు వెంకట శేషాచారి, యువ నాయకులు సాయిరాం రెడ్డి, సోమేశ్వరరావు గోవిందస్వామి, కుడుపూడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు











