E-PAPER

విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేత. 

Date : 11 March 2026, 4:56 pm Posted By : PRAJA GONTHUKA

విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేత. 

విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేత.

ప్రజా గొంతుక కొమురవెల్లి : కొమురవెల్లి మండoలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు బి.ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బొంగు రాజేందర్ రెడ్డి పరీక్ష ప్యాడ్లు మరియు స్టేషనరీ అందజేశారు. ఈ సందర్భంగా బొంగు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనుబరిచి పాఠశాలకు, మండలానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. మండలంలో ని 2025-2026 బ్యాచ్ కు చెందిన పదవ తరగతి పరీక్షలలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థికి 11,116/- రూపాయలు, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థికి 5116/- రూపాయలు అందజేశారు. ప్రతి సంవత్సరం లాగే 2026- 2027మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థికి 21,116/- రూపాయలు, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థికి 11,116/- రూపాయలు ఇస్తానని బిఆర్ ఆర్ ఫౌండేషన్ తరపున అందజేస్తానని రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బొంగు రాజేందర్ రెడ్డి, ఫౌండేషన్ సభ్యులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు పాఠశాల సిబ్బంది పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేత.

ప్రజా గొంతుక కొమురవెల్లి : కొమురవెల్లి మండoలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు బి.ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బొంగు రాజేందర్ రెడ్డి పరీక్ష ప్యాడ్లు మరియు స్టేషనరీ అందజేశారు. ఈ సందర్భంగా బొంగు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనుబరిచి పాఠశాలకు, మండలానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. మండలంలో ని 2025-2026 బ్యాచ్ కు చెందిన పదవ తరగతి పరీక్షలలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థికి 11,116/- రూపాయలు, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థికి 5116/- రూపాయలు అందజేశారు. ప్రతి సంవత్సరం లాగే 2026- 2027మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థికి 21,116/- రూపాయలు, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థికి 11,116/- రూపాయలు ఇస్తానని బిఆర్ ఆర్ ఫౌండేషన్ తరపున అందజేస్తానని రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బొంగు రాజేందర్ రెడ్డి, ఫౌండేషన్ సభ్యులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు పాఠశాల సిబ్బంది పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్