పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కొంతన్ పల్లి సర్పంచ్.
శివంపేట.ప్రజా గొంతుక న్యూస్, మార్చ్ 8:
మెదక్ జిల్లా. శివంపేట మండలం, కొంతన్ పల్లి గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, ప్రముఖ సంఘసేవకులు, కొంతాన్పల్లి గ్రామ సర్పంచ్ చింతల విజయ వెంకట్రాంరెడ్డి గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో 5,000 వేల రూపాయల ఆర్థిక సహాయం పెద్దిపల్లి రాజు దీప దంపతులకు ఆడ బిడ్డ పుట్టిన సందర్భంగా 5,000 వేల రూపాయలను సర్పంచ్,స్వంత నిధుల నుండి అందజేశారు.
ఆడపిల్లల భవిష్యత్తు భద్రత, విద్యాభివృద్ధి మరియు సమాన హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఈ సహాయం అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బొల్లారం కుమార్, కైలాస్ రామచందర్ గుప్తా,ధరిపల్లి యాదగిరి,పెద్దపల్లి రాములు,గ్రామ పెద్దలు నాయకులు సీవీర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.












