హాలియా మున్సిపల్ కార్యాలయం నందుప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:05
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక
99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు హాలియా మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి అధ్యక్షతన అవగాహన సమావేశం నిర్వహించటం జరిగింది.
ఈ సమావేశంలో భాగంగా రోజువారి కార్యక్రమాలు మరియు వార్డుల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ మరియు కౌన్సిలర్లు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొని చర్చించడం జరిగింది. ఇందులో భాగంగా 6.3 2026 న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభోత్సవం జరుగుతున్నది.













