*మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఎంబీబీఎస్ విద్యార్థులకు చెక్కులు అందజేత..
ఉప్పల్
ప్రజా గొంతుక ప్రతినిధి
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వారి వైద్య విద్యకు అయ్యే ఫీజును ఐటీ, పరిశ్రమ శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిర్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా చెక్కుల రూపంలో అందజేశారు.
8 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు చెక్కులు అందజేయడం జరిగింది.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ బి ఎల్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు చెక్కులు అందజేయడం నిజంగా అభినందనీయం అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గంధం నాగేశ్వర్ రావు ,కాప్రా డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భైరి నవీన్ గౌడ్ , చర్లపల్లి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నేమూరి మహేష్ గౌడ్ బి ఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు












