కార్యకర్త మృతి పార్టీకి తీరని లోటు...
సంతాపం వ్యక్తం చేసి,ఆర్థిక సహాయం అందించిన గ్రామ శాఖ అధ్యక్షుడు కాన్రాజ్ రవీందర్
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
నక్క వాని గూడెం కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త, గ్రామ ఉపాధ్యక్షుడు గోదల పరశురాములు తండ్రి గోదల అంజయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ఆదేశా అనుసారం గ్రామ శాఖ అధ్యక్షుడు కాన్రాజ్ రవీందర్, ఓబిసి సెల్ జిల్లా వైస్ చైర్మన్ చెరుకూరి శ్రీనివాస్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరామర్శించి, నేనున్నానని మనోధైర్యాన్ని నింపి ఆర్థిక సహాయం అందించి ఆ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే వారికి ఎంతో అభిమానం ఉండేదని, ఏ సభ ఏ ప్రోగ్రాం కార్యక్రమం ఉన్న ముందుండి పాల్గొని కార్యకర్తల బలోపేతానికి కృషి చేసే కార్యకర్తను కోల్పోవడం కాంగ్రెస్ పార్టీకి ఈ గ్రామం నుండి తీరని లోటు అని భావోద్యానికి గురయ్యారు. ఈ సందర్భంగా మరోసారి వారికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్సీ సెల్ నాయకులు బొట్టు గణపతి, పంబాల నాగరాజు ,పంబాల రాములు, గోదాల బాలరాజు, తదితరులు, పాల్గొన్నారు.













