గాదె ఇన్నారెడ్డి గారిని పరామర్శించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం
(ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక )
(మార్చి 03)
జఫర్ గడ్ మండలం సాగరం గ్రామంలో మా ఇల్లు ఆశ్రమం వ్యవస్థాపకులు గాదె ఇన్నారెడ్డి గారి తండ్రి గాదె సోలామాన్ రెడ్డి మరణించగా మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఆయన పార్థివా దేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. గాదె ఇన్నారెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నెల రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోవడం అత్యంత బాధాకరమని తెలిపారు. ఇలాంటి కష్ట సమయంలోనే మనోధైర్యాన్ని కోల్పోకూడదని ధైర్యం చెప్పారు. సొలొమాన్ రెడ్డి గారి పవిత్ర ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి వెంట స్థానిక సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు












