నల్గొండ జిల్లాలో మైనర్లకు పొగాకు ఉత్పత్తుల విక్రయంపై పోలీసులు కఠిన చర్యలు......
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్:మార్చి:02
నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు స్థానిక పాన్ షాపుల యాజమాన్యాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన నల్లగొండ టూ టౌన్ ఎస్సై సైదులు
మైనర్లకు పొగాకు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం
పాఠశాలలు, కళాశాలల 100 మీటర్ల పరిధిలో ఉన్న పాన్ షాపులు తక్షణమే మూసివేయాలని ఆదేశం
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు
సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతున్న అంశాలపై ఎస్పీ సీరియస్
నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు సహా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
మైనర్ల భవిష్యత్తును కాపాడటం పోలీసుల బాధ్యత.!
చట్టాన్ని అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని ఎస్ఐ సైదులు స్పష్టం చేశారు












