దోమలు వ్యాప్తి చెందకుండా కిష్టంపేట గ్రామంలో ఫాగింగ్ నిర్వహణ.
ప్రజా గొంతుక (మార్చి 2 )కాల్వ శ్రీరాంపూర్ : పంచాయతీ అధికారుల ఆదేశాల మేరకు కిష్టంపేటలో ఫాగింగ్ నిర్వహణ. కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామ సర్పంచ్ పురుషోత్తం భాగ్య రవీందర్ ఆధ్వర్యంలో దోమల నివారణ కొరకు ఫాగింగ్ చేశారు. దోమలతో మలేరియా, డెంగు, చికెన్ గున్యా, పాటు వైరల్ జ్వరాలు జరాలు విజృంభించే అవకాశం ఉంది, ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని గ్రామపంచాయతీ సిబ్బంది తో దోమల నివారణ కొరకు వాకింగ్ చేయించినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కడెం మహేష్, గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామ కార్యదర్శి పాల్గొన్నారు.












