మన వూరు మన బాధ్యత..... మరణించిన కుటుంబానికి ఆర్ధిక సహాయం
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:01
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు వాస్తవ్యులు పసుపులేటి కొండల్ ఇటీవల అప్పుల బాధతో మరణించడం జరిగింది. వాళ్ల పెద్ద కర్మలో భాగంగా ఈరోజు కొండల్ యొక్క కుటుంబంకు మన ఊరు మన బాధ్యత అనే గ్రూప్ నుండి 5వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని గ్రామానికి అండగా ఉండాలని కోరుకుంటున్నారు












