నేటి నుంచి విద్యుత్ మీటర్ రీడర్ల సమ్మె.
ప్రజా గొంతుక చేర్యాల : పట్టణ కేంద్రంలోని విద్యుత్ మీటర్ రీడర్ల తమ డిమాండ్ల సాధన కోసం మార్చి 1 నుంచి సమ్మె బాట చేపట్టనున్నారు. స్పాట్ బిల్లింగ్ పనులను పూర్తిగా బందు చేస్తూ చేర్యాల,మద్దూరు, దుల్మిట్ట,కొమురవెల్లి మీటర్ రీడర్స్ అందరూ చేర్యాల సబ్ డివిజన్ ఆఫీస్ ముందట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. గత కొన్ని ఏళ్లుగా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పని భారాన్ని పెంచి యాజమాన్యం వేధిస్తోందని తెలిపారు.పీస్ రేట్ మీటర్ రీడర్స్ కార్మికులకు G.O.No 11 జీవో ప్రకారం కనీసం వేతనం అందించాలని NPDCL తరహలో 30 రోజుల పని దినాలు కల్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నజిరుద్దీన్, రాజు , శివ , సందీప్ , అలీం , సిద్దు , వంశీ, వెంకటేష్ , పలువులురు మీటర్ రీడర్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.












