జిఆర్ వివేక్ వాణి విద్యామందిర్ హైస్కూల్ లో
ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
ప్రజా గొంతుక న్యూస్,(ఫిబ్రవరి 28)సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ రోడ్ లోని జి.ఆర్ వివేకవాణి విద్యామందిర్ హైస్కూల్ నందు సర్.సి.వి రామన్ (రామన్ ఎఫెక్ట్) సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా శనివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో "సైన్స్ ఎక్స్ర్పే” సైన్స్ జి.కె. క్విజ్ కాంపిటీషన్ లో విద్యార్థులు ఉత్సాహంతో పాల్గొన్నారు. సైన్స్ ఫెయిర్కార్యక్రమంలో విద్యార్థులు ఇరిగేషన్ సిస్టమ్, మోటార్ రన్నింగ్ సిస్టమ్, హైడ్రాలిక్ పంప్ వర్కింగ్ సిస్టమ్ వంటి ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేశారు. టెక్నాలజీ డెవలప్ మెంట్లో భాగంలో బాలమేధావులను గుర్తించి గొప్ప ఇన్వెన్షన్స్ చేసే విధంగా ఉపాధ్యాయులు తోడ్పడ్డారు. 'నేషనల్ సైన్స్ డే'ను ఉద్దేశించి పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్ గుడిమళ్ళ సంతోష్ శర్మ, గుడిమళ్ళ స్వప్న లు మాట్లాడుతూ నేటి ఆవిష్కర్తలే రేపటి శాస్త్రజ్ఞలు" అన్నారు. క్విజ్ కాంపిటీషన్లో సైన్స్ ఎక్స్ పోలో పాల్గొని విజయం సాధించిన విద్యార్థులకు బహుమతుల, ప్రోత్సాహక సర్టిఫికెట్ లు, సెమినార్ కార్యక్రమాన్ని నిర్వ-హించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు












