ప్రపంచ టైలర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ప్రజా గొంతుక (ఫిబ్రవరి 28)కాల్వ శ్రీరాంపూర్ : మండల కేంద్రంలో ప్రపంచ టైలర్స్ డే సందర్బoగా శనివారం మండల కేంద్రంలో టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.కుట్టుమిషన్ రూపకర్త ఎలియాస్ ఏవే చిత్రపటానికి టైలర్స్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాలకులు టైలర్స్ ను ఆదుకోవాలని, ప్రభుత్వ పరంగా టైలర్ అసోసియేషన్ భవన నిర్మాణానికి, స్థలం కేటాయించి భవన నిర్మాణానికి కృషి చేయాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. టైలర్స్ దుస్తులను కుట్టి,మానవునికి అందాన్ని తీసుకువచ్చే ఆర్టిస్ట్ కులస్తుడు కుట్టు మిషన్ సృష్టికర్త ఏలియాస్ ఏవే అని, అతని జన్మదినాన్ని టైలర్స్ డే గా జరుపుకుంటున్న మని టైలర్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో టైలర్ అసోసియేషన్ అధ్యక్షులు గూట్ల శ్రీహరి, క్యాషియర్ వొడ్నాల రమేష్,మాజీ అధ్యక్షులు వొడ్నాల రాజయ్య, గోలి రంగయ్య, రావుల శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.












