కుక్కల దాడిలో మేక పిల్లలు హతం.
ప్రజా గొంతుక చేర్యాల : మండలంలోని ఆకునూరు గ్రామంలో వ్యవసాయ బావి వద్ద పెన్సింగ్ లో ఉన్న రెండు మేక పిల్లలపై కుక్కలు దాడి చేసి హతమార్చిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. బాధిత మేకల కాపరి రాసూరి లింగం తెలిపిన వివరాల ప్రకారం రోజువారి మాదిరిలాగా తన వ్యవసాయ బావి వద్ద పెన్సింగ్ లో ఉంచిన మేక పిల్లలను వెళ్లి చూసేసరికి కుక్కలు దాడి చేసి హతమార్చినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. కుక్కల బెడద నుండి పశువులను కాపాడాలని కోరారు.












