పదవ తరగతి విద్యార్థులకు మకిలి నవీన్ ప్రోత్సాహం.
ప్రజా గొంతుక కొమురవెల్లి : మండలంలోని గురువన్నపేట ZPHS పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్యాడ్స్ మరియు పెన్నులు ఇచ్చి పరీక్షలకు విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పడం జరిగింది.ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ విద్యార్థి దశలో 10 వ తరగతి చాలా కీలకమైనది కావున విద్యార్థులు సమయం వృధా చెయ్యకుండా బాగా చదివి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు,గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జహంగీర్ గౌడ్ కిషన్ ఉపాధ్యాయులు రాజు,మల్లికార్జును,గిరిబాబు,రమేష్,భిక్షపతి,కవిత తదితరులు పాల్గొన్నారు.












