*పిఎంజెజెబివై చెక్కు అందజేసిన రాయికల్ యూనియన్ బ్యాంకు మేనేజరు నరేష్ ....*
ప్రజా గొంతుక న్యూస్ రాయికల్
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోనీ కొత్తపేట గ్రామానికి చెందిన టి.రాజేందర్ పిఎంజెజెబివై భీమా పథకం 436 రూపాయల ప్రీమియం ను ఆర్థిక అక్షరాస్యత కేంద్రం-మేడిపల్లి వారిచే పిఎంజెజెబివై పథకంలో చేరగా...ఇటీవలే కస్టమర్ మరణించిన విషయాన్ని ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్ నాగేంద్రప్రసాద్ తెలుసుకొని సంబంధిత పత్రాలను యూనియన్ బ్యాంకు మేనేజర్ నరేష్ కి అందజేయగా ఆయన క్లెయిమ్ ప్రాసెస్ చేయించి
అట్టి 2లక్షల రూపాయల భీమా క్లెయిమ్ చెక్కు డబ్బులను నామినిగా ఉన్న అతని భార్య లహరి కి అందజేశారు.అనంతరం మేనేజర్ మాట్లాడుతూ బ్యాంకు ఖాతా కలిగిన ప్రతి ఒక్కరు పిఎం ఎస్ బి వై, పిఎంజెజెబివై ప్రభుత్వ భీమా పథకాలలో చేరాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ నరేష్,యూనియన్ బ్యాంకు సిబ్బంది,ఆర్థిక అక్షరాస్యత కేంద్రం మేడిపల్లి కౌన్సిలర్లు నాగేంద్రప్రసాద్,నవీన్,మేఘమాల తదితరులు పాల్గొన్నారు.












