తెగిన 11 కెవి కరెంటు వైర్... వ్యక్తి మృతి...
ప్రజా గొంతుక భీమదేవరపల్లి:-
11 కెవి వైర్ తెగి, వ్యక్తి మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో చోటుచేసుకుంది.. స్థానికుల వివరాల మేరకు 11కెవి వైర్ తెగి, స్తంభంపై ఇతర వైర్ల పై పడింది.. దీనితో ఇంటి దగ్గర పిండి మిషన్ నడిపిస్తున్న శ్రీరామోజు వెంకటేశ్వర్లు కరెంట్ షాక్కు గురై మృతి చెందినట్లు తెలిపారు.. మృతుడు వెంకటేశ్వర్లకు భార్య, ఇద్దరు కుమారులు రమేష్, సురేష్ ఉన్నారు.. కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.. ప్రభుత్వం తనకు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..













