కౌన్సిలర్ ఆరిఫాఅబ్దుల్లా ఆధ్వర్యంలో చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ కు సన్మానం.....
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఫిబ్రవరి: 20
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ గా చిలుకూరి సుధా బాలకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికైన తదుపరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులకు, మంత్రులకు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసి వారిని సన్మానించడం జరిగింది. అదేవిధంగా మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ కౌన్సిలర్ ఇంటికి చైర్ పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ నేరుగా వెళ్లి కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అందులో భాగంగా 36వ వార్డు కౌన్సిలర్ ఆరిఫా అబ్దుల్లా ఇంటికి వెళ్లి పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షల ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఆరిఫా అబ్దుల్లా ఆధ్వర్యంలో చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణకు షాలువలు, పూలమాలతో ఘనంగా సత్కరించి సీట్లు తినిపించారు. ఈ కార్యక్రమంలో షేక్ షాదుల్లా, రజాక్ హుస్సేన్, మస్తాన్, ఇమామ్ భాషు తదితరులు పాల్గొన్నారు.












