స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో అబ్దుల్లా, లక్ష్మణ్ లకు ఘన సన్మానం....
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్ ఫిబ్రవరి: 20
నల్గొండ జిల్లా మిర్యాలగూడ స్వర్ణకారుల సంఘం మాజీ అధ్యక్షులు, సీనియర్ నేతలు, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున వివిధ వార్డుల నుంచి పోటీచేసి కౌన్సిలర్ గా ఎన్నికైన స్వర్ణకారుల సంఘం సభ్యులను శుక్రవారం స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో సంఘ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. మిర్యాలగూడ పట్టణంలోని 27వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ గా గొట్టిముక్కల ఝాన్సీ లక్ష్మణ్, 36 వార్డు నుంచి కౌన్సిలర్ గా ఆరిఫా అబ్దుల్లా ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా అబ్దుల్లా, లక్ష్మణ్ లను శాలువాలు పూలమాలలతో బోకేలను అందజేసి ఘనంగా సన్మానించారు. స్వర్ణకారుల సంఘం సభ్యులు ఇద్దరు కౌన్సిలర్ గా విజయం సాధించి సంఘానికి వన్నె తెచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు గుంటోజు మధు ప్రధాన కార్యదర్శి చిలుకూరి అశోక్, కోశాధికారి బ్రహ్మచారి, చల్లటి నరసింహ చారి, పరిపూర్ణాచారి, జిల్లపల్లి సంతోష్, షేక్ జిలాని, సైదాచారి, కిరణ్, మస్తాన్ పెద్ద మధు, ఎస్.కే. భాష, తదితరులు పాల్గొన్నారు.













