ముందస్తు అరెస్టులు ఖండిస్తున్నాం...
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా గెలుపు మాదే...
సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ఎండి పిరోజ్..
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలంలో చిన్నరామచర్ల ,పోచన్నపేట సర్పంచులు ఎండి ఆజాం, మాజీ సర్పంచ్ పర్వతం మధు ప్రసాద్,ఎండి ఫిరోజ్, నాయకులు పేరబోయిన పరుశురాములు లను ముందస్తు అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ఎండి పిరోజ్ అన్నారు. సందర్భంగా వారు ఓ ప్రకటన ద్వారా తెలియజేస్తూ గత మున్సిపల్ ఎన్నికలలో జనగాం లో మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లని గెలిపించడంలో ముఖ్యపాత్ర పోషించడం వల్ల ఈరోజు జనగాంకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు వెళ్తున్నామని తెలియడంతో మమ్మల్ని ముందస్తు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. జనగామ మున్సిపల్ చైర్మన్ పీఠం బిఆర్ఎస్ కు దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జనగామలో ఎంతోమంది ఎన్ని కుట్రలు చేసినా మా ఏకైక ఒకే ఒక్కడు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అడ్డుగా నిలిచి బిఆర్ఎస్ మున్సిపల్ పీఠం కైవసం చేసుకుంటుందని తెలియజేశారు.












