మహాశివరాత్రి శుభాకాంక్షలు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
చౌటుప్పల్ ఫిబ్రవరి 15 (ప్రజా గొంతుక)
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. సృష్టి లయకారుడైన ఉమా మహేశ్వరుడు అనునిత్యం భక్తులకు కొంగుబంగారంగా నిలిచే సర్వాంతర్యామి. భోళా శంకరుని గా భారతీయ ఆధ్యాత్మిక సామాజిక జీవనంలో పరమశివునిది ప్రత్యేక స్థానం..ప్రాణికోటిని రక్షిస్తూ ,సృష్టి మనుగడకోసం గరళాన్ని మింగిన మహా త్యాగి,ఆది యోగి, గరళకంఠుడు ఆ పరమేశ్వరుడు..
తెలంగాణ ప్రజలకు సుఖశాంతులు ప్రసాదించి, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేలా దీవెనలు అందించాలని ప్రార్థించారు.












