కృష్ణవేణి పాఠశాల స్మార్ట్ జీనియస్ సంస్థ అబాకస్, వేదగణిత గ్లోబల్ లెవెల్ పోటీ పరీక్షలో పాల్గొన్న 197 మంది విద్యార్ధులు.....
ర్యాంకులు పొందిన 27 మంది విద్యార్ధులు
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:14
స్మార్ట్ జీనియస్ సంస్థ అబాకస్, వేదగణిత గ్లోబల్ లెవెల్ పోటీ పరీక్షలో పాల్గొన్న 197 మంది కృష్ణవేణి పాఠశాల విద్యార్ధులు డిసెంబర్ 20వ తారీఖున నిర్వహించిన అబాకస్ మరియు వేదగణిత గ్లోబల్ లెవెల్ పోటీ పరీక్షలో మా పాఠశాల నుండి 197 మంది విద్యార్థులు పాల్గొనగా, 27 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు.
అవార్డులు సాధించిన విద్యార్థులు ఈ రోజు అనగా 14-02-2026 నాడు రవీంద్ర భారతి కళావేదిక, హైదరాబాద్ లో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరై, ముఖ్య అతిధిగా విచ్చేసిన కేంద్ర బొగ్గు & గనుల మంత్రి జి కిషన్ రెడ్డి చేతుల మీదుగా అవార్డులు స్వీకరించారు.












