గడప గడపకు బీజేపీ విస్తృతంగా ప్రచారం
3వ వార్డు బీజేపీ అభ్యర్థి కనుగురు శ్రీలత శివ
ప్రజా గొంతుక జనగామ
జనగామ మున్సిపల్ ఎన్నికల ప్రచారం 3వ వార్డు యందు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కనుగురు శ్రీలత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్ల కోసం గడప గడపకు వెళ్ళి కమలం గుర్తుకు ఓటు వేయాలని కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేను స్థానికురాలుని. గత ప్రభుత్వం భారాస ఎలాంటి అభివృద్ధి చేయలేదు అన్నారు. మా వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజి సమస్య,వార్డులో ఎలాంటి వసతులు లేవని తెలిపారు.తనను గెలుపిస్తే అన్ని సమస్యలు నెరవేరుస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఓటర్లను అత్యధికంగా ఓట్లు వేసి గెలుపించాలి అని కోరారు.ఒకసారి ఓటు వేసి గెలుపిస్తే మురుగు నీరు సమస్య,మంచినీటి సమస్య మరియు సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తనని హామీ ఇచ్చారు. మా వార్డు లో కలెక్టర్ కార్యాలయం ఉన్న ఎలాంటి అభివృద్ధి లేదు అని అన్నారు. వార్డు సమస్యలు నెరవేర్చాలని పలుమార్లు కలెక్టర్ కు వినతిపత్రం అందజేసమని తెలిపారు.ఈ ప్రచారంలో వార్డు ప్రజలు, బిజెపి నాయకులు పాల్గొన్నారు.












