E-PAPER

గద్దరన్న 78వ జయంతి వేడుకలు.

Date : 31 January 2026, 4:32 pm Posted By : PRAJA GONTHUKA

గద్దరన్న 78వ జయంతి వేడుకలు.

గద్దరన్న 78వ జయంతి వేడుకలు.

ప్రజా గొంతుక కొమురవెల్లి : మండల కేంద్రంలోని ప్రజా వాగ్గేయకారులు ప్రజా యుద్ధనౌక గద్దరన్న 78వ జయంతి వేడుకలు తెలంగాణ సాంస్కృతిక సారథి కవి గాయకుడు పిన్నింటి రత్నం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్ గద్దరన్న చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించి అనంతరం మాట్లాడుతూ ప్రజా యుద్ధనౌక, తెలంగాణ పోరాటయోధుడు గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) అణచివేతకు వ్యతిరేకంగా తన ఆటపాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన పోరాటవీరుడు అని సమాజంలో అసమానతలు వివక్షలకు వ్యతిరేకంగా పోరాడిన గొంతుక గద్దర్ అని కొనియాడారు. గద్దర్ జయంతిని ప్రజా ప్రభుత్వం అధికారికంగానిర్వహించడంతో పాటు, ఆయన పేరుతో అవార్డును నెలకొల్పి ప్రతి ఏటా కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ప్రదానం చేయాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేశారు. గద్దర్ గారి పాటలు, ఆలోచనలు, పోరాటస్ఫూర్తి ప్రజల మధ్య శాశ్వతంగా జీవిస్తాయని మహదేవుని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొమురవెల్లి ఉప సర్పంచ్ పోతుగంటి శ్రీనివాస్, ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పిన్నింటి దాసు, దేవస్థానం డైరెక్టర్లు సార్ల లింగం, బొచ్చు ఎల్లయ్య యాదవ్, మాజీ ఎంపిటిసి మేరుగు కృష్ణ, పిఎసి యస్ మాజీ డైరెక్టర్ బత్తిని నర్సింహులు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎరువుల రాజు, సెక్రటరీ ఉప్పల వంశీ, నాయకులు, పంజాల నర్సిములు, తీన్మార్ మల్లన్న టీం నాయకులు పుట్ట రమేష్, పిన్నింటి కుమార్, గడ్డం పర్శరాములు, మండల కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ రమేష్, కిష్టంపేట కుమార్, వెళ్దే ఆంజనేయులు, గొల్లపల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

గద్దరన్న 78వ జయంతి వేడుకలు.

ప్రజా గొంతుక కొమురవెల్లి : మండల కేంద్రంలోని ప్రజా వాగ్గేయకారులు ప్రజా యుద్ధనౌక గద్దరన్న 78వ జయంతి వేడుకలు తెలంగాణ సాంస్కృతిక సారథి కవి గాయకుడు పిన్నింటి రత్నం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్ గద్దరన్న చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించి అనంతరం మాట్లాడుతూ ప్రజా యుద్ధనౌక, తెలంగాణ పోరాటయోధుడు గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) అణచివేతకు వ్యతిరేకంగా తన ఆటపాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన పోరాటవీరుడు అని సమాజంలో అసమానతలు వివక్షలకు వ్యతిరేకంగా పోరాడిన గొంతుక గద్దర్ అని కొనియాడారు. గద్దర్ జయంతిని ప్రజా ప్రభుత్వం అధికారికంగానిర్వహించడంతో పాటు, ఆయన పేరుతో అవార్డును నెలకొల్పి ప్రతి ఏటా కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ప్రదానం చేయాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేశారు. గద్దర్ గారి పాటలు, ఆలోచనలు, పోరాటస్ఫూర్తి ప్రజల మధ్య శాశ్వతంగా జీవిస్తాయని మహదేవుని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొమురవెల్లి ఉప సర్పంచ్ పోతుగంటి శ్రీనివాస్, ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పిన్నింటి దాసు, దేవస్థానం డైరెక్టర్లు సార్ల లింగం, బొచ్చు ఎల్లయ్య యాదవ్, మాజీ ఎంపిటిసి మేరుగు కృష్ణ, పిఎసి యస్ మాజీ డైరెక్టర్ బత్తిని నర్సింహులు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎరువుల రాజు, సెక్రటరీ ఉప్పల వంశీ, నాయకులు, పంజాల నర్సిములు, తీన్మార్ మల్లన్న టీం నాయకులు పుట్ట రమేష్, పిన్నింటి కుమార్, గడ్డం పర్శరాములు, మండల కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ రమేష్, కిష్టంపేట కుమార్, వెళ్దే ఆంజనేయులు, గొల్లపల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్