చుంచుపల్లి ZPTC రిజర్వేషన్ వివాదం
ఢిల్లీ గిరిజన కమిషన్ విచారణకు ఆదేశం
ప్రజా గొంతుక న్యూస్ జనవరి 30/ కొత్తగూడెం
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల రాజకీయ, భూ హక్కుల పరిరక్షణ కోసం సాగుతున్న పోరాటం దేశ రాజధానికి చేరింది. చుంచుపల్లి మండల జెడ్ పి టి సి రిజర్వేషన్ కేటాయింపులో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ దాఖలైన ఫిర్యాదుపై జాతీయ గిరిజన కమిషన్ స్పందించింది. అడ్వకేట్ భూక్యా రాధాకృష్ణ సమర్పించిన ఫిర్యాదును (Diary No: 62183/IN/2026) స్వీకరించి, సమగ్ర విచారణకు ఆదేశించినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు












