వనం నుంచి గద్దె కు చేరిన సారలమ్మ...
ప్రజా గొంతుక జనవరి 29 కాల్వ శ్రీరాంపూర్ :సమ్మక్క సారలమ్మ వనదేవతల జాతరలో భాగంగా తొలి ఘట్టం ఆవిష్కతమైంది. వనదేవత సార్లమ్మ గద్దల పైకి చేరుకుంది. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మీర్జాం పెట, పెద్దరాతుపల్లి, పెగడపల్లి గ్రామంలోని సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆ గ్రామంలోని ఆడపడుచులు ప్రత్యేక పూజల అనంతరం, సారలమ్మ ప్రతిరూపమైన పసుపు, కుంకుమ,భరణేలు, డప్పు చప్పుల మధ్యన, జై సమ్మక్క సారలమ్మ అనే నినాదాలు చేస్తూ, ఆ దేవతను తీసుకొని వచ్చి జాతరలోని గద్దెల పైకి చేర్చారు.












