ఆరోగ్యమే మహాభాగ్యం
విద్యానగర్లో రాగిజావ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కూననేని
ప్రజా గొంతుక న్యూస్ జనవరి 29 /కొత్తగూడెం: ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, నిత్యం వ్యాయామం చేసే వారికి పోషకాహారాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సరికొత్త ముందడుగు పడింది. ప్రతిరోజూ ఉదయం వేళల్లో వాకర్స్కు, వ్యాయామం చేసే వారికి తక్కువ ధరలో బలవర్ధకమైన ఆహారాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన 'రాగిజావ కేంద్రాన్ని' కొత్తగూడెం ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ వాసిరెడ్డి మురళి, నాయకులు బిక్కసాని నాగేశ్వరరావుతో పాటు స్థానిక పంచాయతీ సిబ్బంది, మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.











