గద్దె పైకి బయలు దేరిన సారలమ్మ....
మినీ మేడారం జాతరలో భక్తుల సందడి.
..ప్రజా గొంతుక భీమదేవరపల్లి;-
44 ఏళ్ల నుండి మినీ మేడారం జాతర పేరు ప్రఖ్యాతలు గాంచిన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సమ్మక్క సారలమ్మ జాతర ప్రధాన ఘట్టం ప్రారంభమైంది.. ప్రధాన పూజారి పూజల అనంతరం గద్దె పైకి సారలమ్మ ను గిరిజనులు తీసుకెళ్తున్నారు... భక్త సంద్రంతో ముల్కనూర్ సమ్మక్క ప్రాంగణం నిండిపోయింది..ఇప్పటికే కొండాయి నుంచి గోవిందరాజులు, ముల్కనూరు నుంచి పగిడిద్ద రాజులను గద్దెలపై ప్రతిష్టించారు.. భక్తుల సౌకర్యం కోసం తాగునీరు, వైద్య, విద్యుత్, పారిశుద్ధ్యం, రవాణా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ జక్కుల ఐలయ్య, పోలీసులు సీఐ పులి రమేష్, ఎస్సై లు ఎం రాజు, దివ్య కార్యదర్శి జంగం పూర్ణచందర్, జక్కుల మల్లికార్జున, జక్కుల అనిల్, పోగుల శ్రీకాంత్, తదితరులు ఉన్నారు..













