9వ వార్డులో గులాబీ విజయం.
ప్రజా గొంతుక చేర్యాల: పట్టణంలోని మున్సిపాలిటీలో తొమ్మిదవ వార్డు అభ్యర్థిగా వీరబత్తిని మాధవి సదానందం విజయకేతమణి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం రోజున తొమ్మిదవ వార్డులో ప్రతి ఇంటి చుట్టూ తిరుగుతూ గల్లిలో తిరుగుతూ ప్రచారం చేశారు. అనంతరం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిదో వార్డు అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ గెలుపు అని వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ ఎన్నికల్లో అందరూ కృషి చేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 12 వార్డు లకు గాను బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ఆయన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.












