*ప్రభుత్వం వార్డు మెంబర్లకు గౌరవ వేతనం కల్పించాలి*
కుల్కచర్ల,ప్రజా గొంతుక న్యూస్: ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా గెలుపొందిన వార్డ్ మెంబెర్లను గూర్తించి వారికి గౌరవ వేతనం కల్పించాలని వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో జిల్లా రజక సంఘం ప్రధాన కార్యదర్శి, వార్డు మెంబర్ మోత్కూర్ వెంకటేష్ అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో వార్డ్ మెంబెర్లు పునాది లాంటివారు.గ్రామంలోని వార్డులో వున్న సమస్యల పరిష్కారంలో తమ వంతు కృషి చేస్తున్నారు.ప్రజల సమస్యలను నీరు,రోడ్లు,డ్రైనేజీ,వీధిదీపాలు తదిర సమస్యలు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే ప్రభుత్వం గుర్తించి వీరికి గౌరవవేతనం కల్పించాలని కోరడం జరిగింది.












