రామగుండం కమిషనర్ చేతులమీదుగా ఉత్తమ సేవ ప్రశంస పత్రం అందుకున్న ఎస్సై.
ప్రజా గొంతుక (జనవరి 27 )కాల్వ శ్రీరాంపూర్ : పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సులువ వెంకటేష్ ఉత్తమ పోలీస్ సేవ ప్రశంస పత్రం అందుకున్నారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ చేతుల మీదుగా ఎస్సై వెంకటేష్ ఉత్తమ సేవ ప్రశంస పత్రం ప్రధానం చేశారు. మండలంలో పలు సేవా కార్యక్రమంలో,చురుకుగా పాల్గొంటూ,స్థానిక సమస్యలను తెలుసుకొని,ప్రజల అండగా నిలిచిన ఆయనను సేవలు గుర్తించి, ఈ గౌరవం లభించింది. పోలీసు ఉన్నత అధికారులకు, తన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు, పలువురు గ్రామస్తులు ఎస్ఐ కి అభినందనలు తెలిపారు.












