దేవరకొండలో హనుమాన్ సెంట్రింగ్ యూనియన్ ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
*ప్రజా గొంతుక జనవరి 26 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*
దేవరకొండ నియోజకవర్గంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా అధ్యక్షులు సిదం దాసు వెంకటేశ్వర్లు విష్ణు కాంప్లెక్స్ ఎదురుగా జాతీయ పథకాన్ని అధికారికంగా ఆవిష్కరించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి,
సిరందాసు వెంకటేశ్వర్లు అధ్యక్షులు మాట్లాడుతూ
గణతంత్ర దినోత్సవం ప్రతి భారతీయునిలో దేశభక్తి, బాధ్యత భావనను మరింత బలపరిచే గొప్ప పర్వదినమని పేర్కొన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను సద్వినియోగం చేసుకుంటూ, విధులను నిబద్ధతతో నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజాస్వామ్య విలువలు, సామాజిక సమానత్వం, న్యాయం, తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు, ఉప్పల సత్తయ్య, పాట్లావత్, వెంకట్ రాములు, బెల్లి సైదులు, పులకరం శీను, తోటి పెళ్లి రాంబాబు, నేతాల అనీలు, అందుగుల నరసింహ, నక్క మురళి, పులకరం వెంకటయ్య, ఏసోబు ,దేవ ,శంకర్, ధర్మ, బాలయ్య ,తదితరులు పాల్గొన్నారు.












