మృతుని కుటుంబానికి వార్డు సభ్యుడు సందీప్ ఆర్థిక సహాయం.....
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం ,కొన్నే గ్రామంలో వేపచెట్టు శంకర్ ఆనారోగ్యంతో మృతి చెందడంతో 4 వ వార్డు సభ్యుడు గున్నాల సందీప్ అతని కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం 5000 రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబం త్వరగా కోలుకోవాలని, వారికి మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుణ్ణి వేడుకున్నట్టు అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్రే చెంద్రయ్య, మల్గ అనిల్,కర్రే మల్లేష్,మల్గ నరేశ్, కర్రే మహేష్,మల్గసురేష్,వేపచెట్టు బాలస్వామి,నడిమింటి ఆంజనేయులు, నడిమింటి వెంకటేష్,వేపచెట్టు సిద్దు తదితరులు పాల్గొన్నారు.












