రేపు కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలో ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, ధనసరి సీతక్క, వాకిటి శ్రీహరి పాల్గొననున్న పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల నేపథ్యంలో కేసముద్రం పట్టణంలో పర్యటించానున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ డా. శబరీష్ హెలిప్యాడ్ స్థలం, సమావేశ వేదిక, వీఐపీ రూట్ మ్యాప్, పార్కింగ్ ప్రదేశాలు, ప్రజల రాకపోకల నియంత్రణ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులు, సిబ్బందితో భద్రతా ఏర్పాట్లపై
వీఐపీల రాకపోకలు, ప్రజల భద్రత దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.












