రెడ్డిపల్లి గ్రామంలో వసంత పంచమి వేడుకలు
గండీడ్ జనవరి 23 ప్రజా గొంతుక న్యూస్
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం
సరస్వతి మాత జన్మదిన సందర్భంగా రెడ్డిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రంలో సరస్వతీదేవి పూజ మరియు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్షరాభ్యాసం సందర్భంగా చిన్నారి బాల బాలికలకు గ్రామ ఉపసర్పంచ్ శ్రీమతి ముసలి గారి పారిజాత శ్రీనివాస్ రెడ్డి. పలకలు నోటు పుస్తకాలు మరియు పెన్నులను ఇచ్చి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో. గ్రామ సర్పంచ్ శ్రీమతి గొల్ల సత్యమ్మ సాయిలు. భగవంతు రెడ్డి, పాఠశాల హెచ్ఎం సుధాకర్ రెడ్డి, అంగన్వాడీ టీచర్ శంకరమ్మ, సుకన్య, పల్లె మహిపాల్ రెడ్డి, పల్లె శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు అంజిలయ్య ,జోగు చెన్నయ్య , ఉపాధ్యాయులు లక్ష్మయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు












