14వ జాతీయ మహాసభల సందర్భంగా జెండా ఆవిష్కరణ
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:23
పోరాటాల పురిటి గడ్డ అయిన తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో ఈనెల 25 ,26, 27 ,28 తేదీలలో జరగబోయే ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఈరోజు నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం హలియలో ఐద్వా జెండా ఆవిష్కరణ చేస్తున్న ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి కారంపూడీ ధనలక్ష్మి ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్న ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను రెండవ పౌరురాలుగా చూస్తున్నాయని పోరాటాల పురిటి గడ్డైన .తెలంగాణ రాష్ట్రంలో ఐద్వా మహాసభలు జరగడం గర్వకారణమని సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, మహిళలు పనిచేసే చోట భద్రత కల్పించాలని ,ఈ మహాసభలు హైదరాబాదులో ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరుగుతాయని , ఈనెల 25 న మేధావులు ఇంటికో మహిళ ఊరుకో బండి కదిలి వచ్చి. ఐద్వా భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో .కవిత మంగమ్మ నాగమణి సైదమ్మ, సుమలత , తదితరులు పాల్గొన్నారు.












