ఎన్టీఆర్ నగర్లోనీ ట్రాన్స్ఫార్మర్ కు కొత్త, డి టి ఆర్,అమర్చాలి
జల్లే జయరాజు cpm పార్టీ, మున్సిపాలిటీ శాఖ కార్యదర్శి.
ప్రజాగొంతుక/ కేసముద్రం/ జనవరి/ 22
కేసముద్రం సిపిఎం పార్టీ మున్సిపాలిటీ శాఖ కార్యదర్శి జల్లే జయరాజు ఆధ్వర్యంలో సబ్ స్టేషన్ లోని ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్ అధికారి, కే రాజు ఏఈ కి సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడమైనది. ఈ సందర్భంగా cpm పార్టీ మున్సిపాలిటీ శాఖ కార్యదర్శి జల్లే జయరాజు మాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్లో గత 30, 35 సంవత్సరాల నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద కులాలకు చెందిన కార్మికులు నివాసముంటు మార్కెట్లో కూలి పని చేసుకుని జీవిస్తున్న కాలనీవాసులకు కరెంటు సమస్యతో కొన్ని వీధులకు సింగిల్ ఫేస్ కరెంటు రావడం వల్ల ఫ్యాన్లు లైట్లు టీవీలు కాలిపోతున్నాయని అన్నారు. తక్షణమే ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్ అధికారులు స్పందించి ఎన్టీఆర్ నగర్ లోని ట్రాన్స్ఫార్మర్ కు కొత్త డి టి ఆర్ అమర్చి కరెంటు సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా కొన్ని కరెంటు స్తంభాలకు కరెంటు వైర్లు వేయాలని అధికారులను కోరడమైనది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ శాఖ సభ్యులు చాగంటి కిషన్ శిరస్సు వీరయ్య మట్టే ఏసు తదితరులు పాల్గొన్నారు.












