మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన
బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు భద్రబోయిన సైదులు
ప్రజా గొంతుక న్యూస్, (జనవరి 21)సూర్యాపేట:హైదరాబాద్లో బుధవారం మాజీ మంత్రి టి. హరీష్ రావు ని బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు భద్రబోయిన సైదులు ఆయన నివాసంలో కలిసి పలు సమస్యపై ఆయన దృష్టికి తీసుకెళ్లి పలు అంశాలపై చర్చించారు.
రాబోయే అసెంబ్లీ సమావేశంలో విద్యార్థుల స్కాలర్షిప్ల అంశాన్ని ప్రస్తావించి, అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి విద్యార్థిని, విద్యార్థులకు సంబంధించిన పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ ను విడుదల చేసే విధంగా కృషి చేయాలని కోరారు.












