మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు.
ప్రజా గొంతుక (జనవరి 21) కాల్వ శ్రీరాంపూర్ :మండల కేంద్రంలో బుధవారం భక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలను పద్మశాలి సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు.భక్త మార్కండేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం జెండా ఆవిష్కరించారు. మార్కండేయ స్వామి ఆలయం నుండి స్వామి ఫోటోతో మంగళహారలతో ప్రధాన వీధుల మీదుగా ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు,ఉపసర్పంచ్ గోలి సుధాకర్,పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు సబ్బని రాజమల్లు,జిల్లా ప్రచార కార్యదర్శి వొడ్నాల శ్రీనివాస్,మాజీ సర్పంచ్ ఆడెపు రాజు, క్యాషియర్ వొడ్నాల రమేష్, ఆడెపు శ్రీనివాస్, గోలి కృష్ణమూర్తి, గోలి శ్రీనివాస్, గోలి శ్రీకాంత్, కాసర్ల శ్రీనివాస్, చేరాల శంకర్, ఎనగందుల సంతోష్, గోలి రంగయ్య, గోలి రమణయ్య, పాషికంటి రవీందర్, వొడ్నాల నరసయ్య, కుమ్మరి కుంట, కుమార్, గూట్ల రాజ్ కుమార్, దాసరి శ్రీనివాస్ మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు.












